Saturday, April 27, 2024

కరోనాతో ప్రియురాలు మృతి…. ప్రియుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ప్రాణంగా ప్రేమించిన యువతి కరోనా వైరస్ సోకి మృతి చెందడంతో ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పరవాడ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దేశపాత్రునిపాలే గ్రామానికి చెందిన రోహిత్ కుమార్(25) చదువు మధ్యలో మానేసి హోటల్‌లో పని చేస్తున్నాడు. ఆరుగురు స్నేహితులతో కలిసి కణితి రోడ్డులో నివసిస్తున్నాడు. స్నేహితులతో కలిసి హోటల్‌లో ఆన్‌లైన్ పార్శల్ సర్వీస్ చేసిన అనంతరం తన రూమ్‌కు వెళ్లాడు. రూమ్‌లో ఒంటరిగా ఉన్నప్పుడు అతడు ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. స్నేహితులు రూమ్‌కు వచ్చేసరికి రోహిత్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే వారు స్థానికుల పోలీసులతో పాటు రోహిత్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్‌తో ప్రియురాలు చనిపోవడంతో ప్రియుడు తెగబాధపడుతుండడంతో పలుమార్లు ఓదార్చామని వివరించారు. మరో యువతిని చూసి పెళ్లి చేస్తామని చెప్పినా కూడా తమను వదిలి వెళ్లాడని రోహిత్ తల్లిదండ్రులు కృష్ణారావు, శాంతి కన్నీంటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సిఐ మల్లేశ్వర్ రావు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశపాత్రుని గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News