Thursday, May 9, 2024

యువతిని నగ్నంగా ఉంచి క్షుద్ర పూజలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ యువతిని నగ్నంగా ఉంచి క్షుద్ర పూజలు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గూడూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. గుంటూరు ప్రాంతానికి చెందిన వినుకొండ సుబ్బారావు, వినుకొండ శివ పార్వతిలు క్షుద్ర పూజలతో రోగాలను నయం చేస్తామని మాయమాటలతో నమ్మంచి ప్రజలను మోసం చేస్తుంటారు. గూడూరు మండలానికి చెందిన ఓ అమ్మాయికి రోగంతో బాధపడుతోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సుబ్బారావు-శివ పార్వతిలను కలిశారు. గురువారం అమావాస్య, సూర్య గ్రహణం ఉండడంతో ఆమెను గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. క్షద్ర పూజాలలో భాగంగా ఆమెను నగ్నంగా ఉంచి పూజలు చేశారు. పూజాలు చేస్తుండగా వీడియోలు కూడా తీశారు. ఈ వీడియోలు వాట్సాప్, ఫేస్ బుక్ లలో వైరల్ కావడంతో బాధితురాలు తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ దుర్గా ప్రసాద్, సిఐ కొండయ్య ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. క్షుద్ర పూజల పేరుతో మాయ మాటలు చెబితే నమ్మవద్దని సిఐ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News