Friday, April 26, 2024

హత్యాయత్నం కేసులో యువకుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Youth arrested in attempted murder case

ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కోమాలో బాధితుడు

హైదరాబాద్: యువకుడిపై హత్యాయత్నం చేసిన ఇద్దరు నిందితులను షాలిబండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పర్చి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని షాలిబండకు చెందిన బుద్దబోయిన అభిషేక్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పొన్నబోయిన ధర్మవీర్ ముదిరాజ్ వ్యాపారం చేస్తున్నాడు. మేకలబండకు చెందిన చిన్నబోయిన వంశీ యాదవ్, చిన్నబోయిన రాకేష్ యాద్, చిన్నబోయిన కృష్ణ యాదవ్ బైక్ ఇంటికి వెళ్తున్నారు. వీరి మధ్య పాత కక్షలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఈ నెల 3వ తేదీన తెల్లవారుజామున బైక్‌పై అభిషేక్, ధర్మవీర్ వెళ్లడం చూసిన వంశీ, రాకేష్, కృష్ణ వారిని వెంబడించారు. వారి బైక్‌ను ఆపివేసి ముగ్గురు కలిసి దాడి చేశారు. దీంతో ధర్మవీర్ తలకు తీవ్రగాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అభిషేక్‌కు కూడా గాయాలయ్యాయి. వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందివ్వడంతో వచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. ధర్మవీర్ కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. బాధితుడు అభిషేక్ షాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు వాడిని రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు రిమాండ్‌కు పంపించారు. ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై సుధాకర్ నిందితులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News