Tuesday, April 30, 2024

రామాలయం నిర్మాణం పేరుతో ఎన్నికలకు బిజెపి నిధుల సేకరణ : రాజ్‌భార్

- Advertisement -
- Advertisement -

BJP raises funds for polls in name of Ramalayam construction: Rajbhar

 

లక్నో : అయోధ్యలో రామాలయ నిర్మాణానికి నిధుల సేకరణ పేరుతో రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బిజిపి నిధులు పోగు చేస్తోందని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్‌భార్ ఆరోపించారు. ఇవి అసంబధ్ధమైన ఆరోపణలని బిజెపి కొట్టివేసింది. వంద కోట్ల వంతున అనేక విరాళాలు వసూలవుతున్నాయని, రామాలయ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ విధంగా రూ.1400 కోట్ల స్కామ్ నడుస్తోందని ఆయన మంగళవారం విలేఖరులతో అన్నారు. దీనిపై బిజెపి అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠీ మాట్లాడుతూ అసంబధ్ధ ఆరోపణలు చేయడంలో రాజ్‌భార్ పేరుపొందారని, అది కేవలం మీడియాలో ప్రచారం కోసమేనని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News