- Advertisement -
గోరఖ్పూర్ (యుపి): గోరఖ్పూర్ జిల్లా చౌరీ చౌరా ఏరియా గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చెవిటి, మూగ బాలికపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 18 ఏళ్ల ఈ బాలిక నిద్రిస్తున్న సమయంలో నిందితుడు పింటు ప్రసాద్ ఆమె ఇంటిలోకి ప్రవేశించి బాలిక ముఖాన్ని కప్పివేసి అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో ఆమె వదిన స్నానం చేస్తోందని, శబ్దం విని బయటకు రాగా, నిందితుడు ఆమెను తోసివేసి అక్కడ నుంచి పారిపోడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ఆమె తల్లిదండ్రులు పనిలోనుంచి ఆరుగంటలకు ఇంటికి రాగా ఈ విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం నిందితుడిని అరెస్టు చేశారు.బాధితురాలిని వైద్య పరీక్షకు పంపినట్టు చౌరీచౌరా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ త్రిపాఠీ చెప్పారు.
- Advertisement -