Saturday, April 27, 2024

మాంజా మరణ శాసనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో: పతంగుల సరదా ప్రతీ సంవత్సరం పలువురి ప్రాణాలు హరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం పతంగులను ఎగిరవేసే సమయంలో ప్రమాదవశాత్తూ హైదరాబాద్ నగరంలో ఇద్దరు మృతి చెందగా, సంగారెడ్డి జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో పండుగ వేళ ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఎపిలోని వి శాఖపట్టణం, పెద్దవాల్తేరు గ్రామానికి చెందిన కాగితాల కోటేశ్వర్‌రెడ్డి (30) ఆర్మీలో నాయక్‌గా పని చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి లంగర్‌హౌస్‌లో ఉంటున్నాడు. ఈ నెల 13వ తేదీన విధులు ముగించుకుని రాత్రి 7.25 గంటలకు లంగర్‌హౌస్‌లోని ఇంద్రారెడ్డి ఫ్లైఓవర్ మీదుగా బైక్‌పై వెళ్తుండగా చైనా మాంజా కోటేశ్వర్‌రెడ్డి మెడకు చుట్టుకుంది. దీంతో మెడ తెగటంతో ఫ్లైఓవర్‌పై పడిపోయాడు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

లంగర్‌హౌస్ పోలీసులు 304 ఐపిఎస్ కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఎఎస్సైగా పనిచేస్తున్న రాజశేఖర్ కుమారుడు ఆకాష్ (20) సంక్రాంతి పండగ కావడంతో పతంగి ఎగురవేసేందుకు బిల్డింగ్ ఎక్కాడు. ఈ క్రమంలోనే గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు భవనంపై ఉంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అదే విధంగా క్రిష్ణా జిల్లా కొరగంటిపాలెంకు చెందిన సుబ్రమణ్యం (35)కు సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన చాముండేశ్వరిదేవితో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగిం ది. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లా జోగిపేటకు పండుగకు వచ్చిన సుబ్రమణ్యం ఆదివారం పతంగులు ఎగురవేయటానికి భవనం ఎక్కాడు. ఈ క్రమంలో పతంగి కరెంట్ వైర్లకు చిక్కుకుపోవటంతో దానిని తీసే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై భవనం నుంచి కిందపడ్డాడు. భర్తను కాపాడేందుకు ప్రయత్నించగా భార్య చాముండేశ్వరిదేవికి కూడా గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే సుబ్రమణ్యం మృతి చెందాడు. దీంతో పండుగ రోజు ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ముగినిపోయాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News