Sunday, May 12, 2024

భార్యకు కిలో బంగారంతో మంగళసూత్రం.. నెట్టింట్లో వైరల్

- Advertisement -
- Advertisement -

1 kg gold mangalsutra in Bhiwandi couple Anniversary

భివాండి: మహరాష్ట్రకు చెందిన బాలా కోలి అనే వ్యక్తి వారి వివాహ వార్షికోత్సవ వేడుక ప్రత్యేకంగా ఉండాలని భార్యకు కెజి బంగారంతో మంగళసూత్రం చేయించి బహుమతిచ్చాడు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదికాస్త వైరల్ కావడంతో పోలీసులు అతనిని స్టేషన్ కు పిలిచి విచారించారు. అతను చెప్పిన సమాధానికి పోలీసులు షాక్ తిన్నారు. ఆ మంగళసూత్రాన్ని రూ. 38 వేలకు కొన్నట్టు పోలీసులకు బిల్ చూపించాడు అతను. లోతుగా విచారించగా అది గిల్టు నగ అని తెలిపింది. పాపం భార్యను సంతోషపెట్టడానికి ఈ ప్లాన్ చేశాడని చెప్పుకొచ్చాడు. తన భార్య కోసం అతను చేసిన ప్రయత్నం పోలీసులను ఇంటి వద్దకు తీసుకువస్తుందని అతనికి తెలియదు కాబోలు..! పోలీసులు అతను నగ కొన్న ఆభరణాల దుకాణంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖరీదైన వస్తువుల గురించి సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని భివాండి పోలీసులు సూచించారు. సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేసే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉటుందని,  ఖరీదైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో భద్రంగా ఉంచుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు.

1 kg gold mangalsutra in Bhiwandi couple Anniversary

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News