మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో రెండు, మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు తిరిగి పదివేలకు చేరుకున్నాయి. ఈక్రమంలో గడిచిన 24 గంటల్లో ఎపి రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన 77మంది మృతి చెందారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం నాటికి ఎపిలో 10,128 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,86,461కి చేరింది. ఇందులో 80,426 కేసులు యాక్టివ్ గా ఉండగా, 1,04,354 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఎపిలో 77 కరోనా మరణాలు సంభవించాయని, ఈ నేపథ్యంలో మొత్తం మరణాల సంఖ్య 1681కి చేరింది. ఇక జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ జిల్లాలో 1260, చిత్తూరులో 677, తూర్పు గోదావరిలో 1544, గుంటూరులో 730, కడపలో 729, కృష్ణాలో 440, కర్నూలులో 1368, నెల్లూరులో 537, ప్రకాశం జిల్లాలో 349, శ్రీకాకుళంలో 405, విశాఖపట్నంలో 842, విజయనగరం జిల్లాలో 665, పశ్చిమ గోదావరి జిల్లాలో 582 కేసులు నమోదయ్యాయి.
10128 New Corona Cases Reported in AP