- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ.. మళ్ళీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,050 పాజిటివ్ కేసులు, నలుగురు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 1,736 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,56,713కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,38,908 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 1,401మంది బాధితులు కోవిడ్-19తో మృతిచెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16,404 యాక్టివ్ కేసులున్నాయి. 13,867మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ లో కొత్తగా 232, రంగారెడ్డి జిల్లాలో 75 పాజిటివ్ కేసులు బయపడ్డాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 48,53,169మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
- Advertisement -