- Advertisement -
ముంబై: మహారాష్ట్ర సతారా జిల్లాలో శనివారం ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. యాభై అడుగుల వంతెనపై నుంచి మినీ బస్సు కిందపడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, మహిళ, చిన్నారి ఉన్నారని పోలీసులు తెలిపారు. బస్సు ముంబై నుంచి గోవాకు ప్రయాణిస్తున్న సమయంలో పూణె-బెంగళూరు హైవేపై అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
Five killed in road accident in Maharashtra
- Advertisement -