Friday, May 17, 2024

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Five killed in road accident in Maharashtraముంబై: మహారాష్ట్ర సతారా జిల్లాలో శనివారం ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. యాభై అడుగుల వంతెనపై నుంచి మినీ బస్సు కిందపడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, మహిళ, చిన్నారి ఉన్నారని పోలీసులు తెలిపారు. బస్సు ముంబై నుంచి గోవాకు ప్రయాణిస్తున్న సమయంలో పూణె-బెంగళూరు హైవేపై అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

Five killed in road accident in Maharashtra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News