Friday, May 17, 2024

24గంటల్లో 10,956 కరోనా కేసులు.. 396 మంది మృతి

- Advertisement -
- Advertisement -

10956 new covid 19 cases and 396 deaths in india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో అత్యధికంగా 10,956 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 396 మరణాలు సంభవించినట్లు ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ తో ప్రస్తుతం 1,41,842 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా 1,47,195 నయమై కోలుకున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ మహమ్మారి బారిన పడి 8,498 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,97,535కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అటు మహారాష్ట్రంలో కోవిడ్ కేసులు లక్షకు చేరువయ్యాయి. ప్రస్తుతం 97,648మందికి కరోనా సోకగా… 3,590మంది కరోనాతో మరణించారు. తమిళనాడులో 38,716 కరోనా కేసులుండగా… 349 మంది మృతి చెందారు. దేశరాజధాని ఢిల్లీలో 34,687మంది కోవిడ్ బారిన పడగా.. 1,085మందిని కరోనా కబలించింది. గుజరాత్ లో 22,067మందికి కరోనా బారిన పడగా… 1,385 మంది చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పదివేలు దాటడం ఇదే తొలిసారి.

10956 new covid 19 cases and 396 deaths in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News