- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో మరో 11 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1107కు చేరింది. ఈ రోజు నమోదైన కేసులన్నీ జిహెచ్ఎంసి పరిధిలోనివేనని ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా మరణాలేమి నమోదుకాలేదని, కరోనా నుంచి మరో 20 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. ఇప్పటివరకు 648 మంది కరోనా బాధితులు కోలుకున్నారని, రాష్ట్రంలో మొత్తం 29 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 430 మంది చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ వివరించింది.
11 Coron Cases Registered in Telangana
- Advertisement -