Tuesday, April 30, 2024

24 గంటల్లో 11,458 మందికి సోకిన కరోనా

- Advertisement -
- Advertisement -

11458 new covid 19 cases and 386 deaths in india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షలు దాటాయి. ఇండియాలో గడిచిన 24గంటల్లో అత్యధికంగా 11,458 కొత్త కోవిడ్-19 కేసులు, 386 మంది మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండియాలో మొత్తం కరోనా కేసులు 3,08,993కి పెరిగాయి. దేశంలో ఇప్పటివరకు 1,45,779 యాక్టివ్ కేసులున్నాయి.

దేశంలో 1,54,330 నయమై కోలుకున్నారు. ఈ వైరస్ బారినపడి 8,884 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అటు మహారాష్ట్రంలో కరోనా కేసులు లక్ష దాటాయి. ప్రస్తుతం 1,01,141 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,717 మంది చనిపోగా… 47,796మంది కరోనాతో కోలుకున్నారు. ప్రస్తుతం 49,628మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.

11458 new covid 19 cases and 386 deaths in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News