- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 50,972 మందికి పరీక్షలు నిర్వహించగా, 11,698 మందికి కరోనా వైరస్ సోకింది. మరో 37 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,18,031కి చేరింది. అదే సమయంలో 4,421 మంది భాదితులు కోలుకున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం 81,471 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 9,31,839 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 7,616 మంది మృతి చెందారని ఎపి ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, ఐదు జిల్లాల్లోనే ప్రతిరోజు 7వేల వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
11698 New Covid-19 Cases Reported in AP
- Advertisement -