Thursday, May 9, 2024

ఎపిలో కొత్తగా 11,766 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

11766 new covid-19 cases reported in AP

అమరావతి: ఎపిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు 11 వేలు దాటాయి. గడిచిన 24గంటల్లో 11,766 మందికి కరోనా వైరస్ సోకింది. మరో 38మంది బాధితులు కోవిడ్ తో మృతిచెందారు. అదే సమయంలో 4,441 మంది కోలుకున్నారు. ఆంధ్రలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 10,06,333 లక్షలు దాటింది. రాష్ట్రంలో మొత్తం 74,231 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 7,579కి పెరిగాయి. ఎపిలో 5 జిల్లాల్లోనే సుమారు 7వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఎపిలో 24గంటల్లో 45,581 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు ఎపి ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

11766 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News