Monday, May 6, 2024

రాష్ట్రంలో కొత్తగా 134 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -
134 new covid cases reported in telangana
విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి కొవిడ్ పాజిటివ్

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,900 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 134 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. శనివారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,79,564కు పెరిగింది. తాజాగా 201 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,71,856 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 4,015కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.86 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. ప్రస్తుతం

రాష్ట్రంలో 3,693 యాక్టివ్ కేసులున్నాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 20 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. శనివారం విదేశాల నుంచి 532 మంది రిస్క్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. వారిలో ఒకరికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రిస్క్ దేశాల నుంచి 7,738 మంది విదేశీ ప్రయాణికులు రాష్ట్రానికి రాగా, వారిలో 16 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.అలాగే నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన నలుగురికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. మరో ఏడుగురి ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News