Saturday, May 4, 2024

‘మహా’ పోలీసుశాఖలో కరోనా కలకలం.. కొత్తగా 140 కేసులు, ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయిః మహారాష్ట్రలో మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్ర పోలీసుశాఖలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా 140మంది పోలీసులకు కరోనా సోకింది. కరోనాతో ఈ రోజు ఓ పోలీసు అధికారి మృతి చెందారు. దీంతో మహారాష్ట్ర పోలీసు శాఖలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,690కి చేరింది. దేశంలో కరోనా కేసులు మహారాష్ట్రలోనే అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ ఒక్క రాష్ట్రంలోనే లక్షకు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య ఆరు వేలకు చేరువైంది. దీంతో మహారాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

140 Maharashtra Cops tests positive for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News