Saturday, April 27, 2024

ఎపిలో 142 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

142 new Covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గడచిన 24 గంటల్లో 32,793 కరోనా పరీక్షలు నిర్వహించగా 142 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో ఇద్దరు మృతి చెందారు. కొవిడ్ నుంచి 188 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,989 పాజిటివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. అనంతపురంలో 17, చిత్తూరులో 14, తూర్పుగోదావరిలో 21, గుంటూరులో 28, కడపలో 2, కృష్ణాలో 13, కర్నూలులో 1, నెల్లూరులో 6, ప్రకాశంలో 4, శ్రీకాకుళంలో 7, విశాఖపట్నంలో 10, విజయనగరంలో 2, పశ్చిమగోదావరిలో 17 కేసులు నమోదయ్యాయి. కాగా కరోనాతో చికిత్స పొందుతూ చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News