Wednesday, May 15, 2024

రాష్ట్రంలో మరో 161 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

161 new covid-19 cases reported in telangana

హైదారబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 161 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో ఒకరు మృతి చెందగా, మరో 147 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,431కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,608 కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణవ్యాప్తంగా ఇప్పటివరకు 2.91లక్షల మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,977 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో 845 మంది  చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 28 మందికి కరోనా సోకినట్టు రాష్ట్ర వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.

161 new covid-19 cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News