- Advertisement -
హైదరాబాద్: నగరంలోని మైలార్ దేవ్ పల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వ్యక్తి ప్రాణం తీసింది. అతివేగంతో వచ్చిన లారీ బైక్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ చక్రాల కిందపడి వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం తర్వాత వాహనం వదిలి లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై ఆగ్రహించిన స్థానికులు లారీని ధ్వంసం చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం లారీని అదుపులోకి తీసుకుని డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Man Death in Road Accident At Mylardevpally
- Advertisement -