- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 49,084 మందికి టెస్టులు చేయగా 1,718 కొత్త కోవిడ్-19 కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 2,002మంది బాధితులు కోవిడ్ ను జయించారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1,97,327కి చేరాయి. ఇప్పటివరకు 1,67,846 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా… రాష్ట్రంలో 28,328 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 1153 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 23,224 మంది బాధితులు హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారని రాష్ట్ర వైద్య శాఖ పేర్కొంది. హైదరాబాద్ లో కొత్తగా 285 కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో ఇప్పటివరకు 31.53 లక్షల కరోనా బాధితులకు టెస్టులు చేసినట్టు అధికారులు తెలిపారు.
1718 new covid 19 cases reported telangana
- Advertisement -