హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో రాత్రి భూమి కంపించింది. దీనికి తోడు భారీ శబ్దాలు రావడంతో జనం భయాందోళనకు గురైయ్యారు. శుక్రవారం రాత్రి 8.15 గంటల నుంచి 9 గంటల మధ్య 12 సార్లు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్, రహమత్నగర్, బోరబండ సైట్-3, ఎస్పీఆర్ హిల్స్, అల్లాపూర్ రాత్రంతా ప్రకంపనలు వచ్చాయి. దీంతో జనాలు భయంతో ఇళ్ల బయటే పడుకున్నారు. అయితే, బోరబండలో రాత్రి 11.25 గంటలకు మరోమారు భూమి పెద్ద శబ్దంతో కంపించింది. సమాచారం అందుకున్న అధికారులు బయపడొద్దంటూ వైకులు ద్వారా అవగాహన కల్పించారు. ఉదయం ఇళ్లలోకి వెళ్దామనుకునేలోపు మళ్లీ శబ్ధాలు మొదలయ్యాయి. 2017 అక్టోబర్ లోనూ ఇలాగే భారీ శబ్ధాలు వచ్చాయని స్థానికులు తెలిపారు.
Hyderabad Some sounds from the earth – many people came out of homes at borabanda area @DC_Quthbullapur @GHMCOnline @hydcitypolice
Some fear it’s an earth quake
Some say big sounds from the earth pic.twitter.com/IENv8Jx0mE— Lokesh journo (@Lokeshpaila) October 2, 2020
earthquake in hyderabad borabanda