Saturday, April 27, 2024

భవనం పైకప్పు కూలి 18 మంది మృతి

- Advertisement -
- Advertisement -

18 Members dead in Building collapsed in UP

ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని ముర్దాబాద్ లో ఆదివారం మధ్యాహ్నం భవనం కూలింది. ఈ ప్రమాదంలో 18 మృతి చెందగా పలువురు త్రీవంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 40 మందిపైగా గాయపడినట్టు సమాచారం. శ్మశాన వాటికలో ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా వర్షం రావడంతో ఘాట్ కాంప్లెక్స్ లో కొందరు నిలబడ్డారు. ఆ సమయంలో కాంప్లెక్స్ పైకప్పు కూలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాదం స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను ఎంఎంజి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై యుపి సిఎం యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలపడంతో పాటు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనకు  సంబంధించి సమాచారాన్ని సేకరించి పరిహారం ఇవ్వాలని  జిల్లా అధికారులకు సిఎం ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News