Wednesday, May 22, 2024

బస్సును ఢీకొట్టిన ట్రక్కు: 18 మంది మృతి

- Advertisement -
- Advertisement -

18 Members dead in Truck collided bus in UP

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో-ఆయోధ్య జాతీయ రహదారిపై రామ్ సనాహి ఘాట్ సమీపంలో ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో 18 మంది ఘటనా స్థలంలో చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించామని ఎడిజి సత్యనారాయణ సబాత్ తెలిపారు. 140 మంది వలస కార్మికులు అంబాలా నుంచి బీహార్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సగం మంది ప్రయాణికులు బయట ఉండడంతో మృతుల సంఖ్య తగ్గిందని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News