Saturday, May 4, 2024

రాష్ట్రంలో మరో 185 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

185 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్-19 విజృంభణ భారీగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల్లో 185 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్ బారిన పడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 197 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 2,94,924 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనాతో ఇప్పటివరకు 1,604 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,91,312 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 2,008 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో 730 మంది చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 27 మంది కరోనా బారినపడ్డారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

185 New Covid-19 Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News