Wednesday, May 15, 2024

రాష్ట్రంలో 200 దిగువకు రోజువారీ కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -
187 new covid-19 cases reported in telangana
కొత్తగా 187 కేసులు… ఒకరి మృతి

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 39,161 మందికి కరోనా పరీక్షలు 187 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. బుధవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,67,158కు పెరిగింది. తాజాగా 170 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,58,827 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒక్కరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,925కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.75 శాతంగా నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,406 యాక్టివ్ కేసులున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News