Monday, April 29, 2024

యువతిపై అత్యాచారం.. ఆపై చిత్రహింసలు

- Advertisement -
- Advertisement -

నాగపూర్: అపస్మారక స్థితిలో ఉన్న ఒక 19 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిపిన ఒక కామోన్మాది ఆమె మర్మాంగంలో ఇనుప రాడ్‌ను జొప్పించాడు. అమానుషమైన ఈ సంఘటన ఇక్కడి పర్ది ప్రాంతంలో ఈ నెల 21న సంభవించింది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడు 52 ఏళ్ల యోగీలాల్ రహంగ్‌డాలేను గోండియా జిల్లాలో అరెస్టు చేసినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. ఒక స్పిన్నింగ్ మిల్లులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న నిందితుడు అక్కడే కార్మికురాలిగా పనిచేస్తున్న బాధితురాలిపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలు తన సోదరుడితో కలసి పర్దిలో ఒక అద్దె ఇంట్లో నివసిస్తోంది. నిందితుడు కూడా మరో యువతితో కలసి మరో ఇంట్లో ఉంటున్నాడు. 21వ తేదీన బాధితురాలి సోదరుడు, నిందితుడితో నివసించే యువతితో కలసి పనిమీద తన స్వగ్రామానికి వెళ్లగా అదే రోజు రాత్రి ఒంటరిగా ఉన్న బాధితురాలిపై రహంగ్‌డలే అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమె నోట్లో బట్ట ముక్క కుక్కాడు. దీంతో స్పృహ కోల్పోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు ఆమె మర్మాంగంలో ఇనుప రాడ్‌ను జొప్పించాడని బాధితురాలి ఫిర్యాదును ఉటంకిస్తూ పర్ది పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సునీల్ చవాన్ తెలిపారు. జనవరి 24వ తేదీన ఇంటికి తిరిగి వచ్చిన సోదరుడికి బాధితురాలికి జరిగిన దారుణాన్ని తెలియచేయగా అదే రోజు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

19 yr old Nagpur woman raped in unconscious state

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News