Saturday, April 27, 2024

కామారెడ్డిలో విషాదం: చెరువులో మునిగి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

2 Dead as drowned in Pond in Kamareddy

కామారెడ్డి: జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలో లింగంపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలోని ఊర చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. గ్రామానికి చెందిన హనీఫ్(36), లింగంపేట్ చెందిన శ్రావణ్‌(22)లు సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. ముందుగా చెరువులోకి దిగిన శ్రావణ్ మునిగిపోయాడు. దీన్ని గమనించి శ్రావణ్ ను కాపాడేందుకు చెరువులోకి దూకిన హనీఫ్.. ప్రమాదవశాత్తు శ్రావణ్ తోపాటు మునిగిపోయాడు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ప్రజల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

2 Dead as drowned in Pond in Kamareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News