Monday, April 29, 2024

జమ్మూలో మరోసారి డ్రోన్లతో దాడికి యత్నం..

- Advertisement -
- Advertisement -

2 Drone attack in Kaluchak Military Camp

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో మరోసారి డ్రోన్లతో బాంబు దాడికి ఉగ్రవాదులు యత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా ధళాలు రెండు డ్రోన్లపై కాల్పులు జరిపి నిర్వీర్యం చేశాయి. జమ్మూలోని కలుచక్ మిలిటరీ స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో జమ్మూలో ఇండియన్ ఆర్మీ హై అలర్ట్ ప్రకటించింది. ఆదివారం తెల్లవారుజామున జమ్మూలోని వాయుసేన ఎయిర్‌పోర్టులోని హెలికాప్టర్ల హ్యాంగర్లపై డ్రోన్లతో బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వాయుసేన ఆయుధాలకు, వాహనాలకు ఎలాంటి నష్టం జరగలేదు.. కానీ ఇద్దరు సైనికులు స్వల్పంగా గాయపడ్డారు. కాగా, ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే మరోసారి ఉగ్రవాదులు డ్రోన్లతో బాంబు దాడికి ప్రయత్నించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

2 Drone attack in Kaluchak Military Camp

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News