Friday, April 26, 2024

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

 

తిమ్మాపూర్: కరీంనగర్, మేడ్చల్ జిల్లాలో ఆదివారం ఉదయం రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మానేరు వంతెన పైనుంచి కారు కిందపడిపోవడంతో ఒక వ్యక్తి మృతి చెందగా అతడి భార్య తీవ్రంగా గాయపడింది. మృతుడు గండి శ్రీనివాస్‌గా గుర్తించారు. మృతుడి భార్య స్వరూప ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నీళ్లలో నుంచి కారును బయటకు తీశారు. కారు కాలువలో నుంచి బయటకు తీస్తుండగా కానిస్టేబుల్ ప్రమాదావశాత్తు పైనుంచి కాలువలో పడిపోయాడు. దీంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. మేడ్చల్ జిల్లా డబిల్ పూర్ దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

2 Members Dead in Car accident in KarimnagarMedchal

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News