మనతెలంగాణ/హైదరాబాద్: నగర పోలీసుల్లో కరోనా టెన్షన్ నెలకొంది. వరుసగా పోలీసులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన చెందుతున్నారు. టపాచపుత్ర పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ, ఎస్సైతోపాటు 20మంది కానిస్టేబుళ్లు కరోనా పాజిటివ్ రావడంతో హోంక్వారంటైన్కు వెళ్లారు. గతంలో కూడా ఇదే స్టేషన్లో పనిచేసి కానిస్టేబుళ్లకు పాజిటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బంజారాహిల్స్ పోలీసుల్లో 20మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో ఎస్సై స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకు ఉన్నారు. పోలీసులు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడంతో పాజిటివ్ బారిన పడుతున్నారు.
కంటైన్మెంట్ జోన్ ప్రకటించగానే వైద్య సిబ్బందితోపాటు పోలీసులు కూడా విధులు నిర్వర్తిచండతో కరోనా బారినపడుతున్నారు. గతంలో బేగంబజార్ పిఎస్లో ఇద్దరు, సిఎఆర్లో ఇద్దరు హుమాయున్నగర్లో ఒకరు, అఫ్జల్ గంజ్లో ఒకరు, ఎస్ఆర్ నగర్లో ముగ్గురు, చత్రినాకలో ఒకరు, బహదూర్పురాలో ఒక కానిస్టేబుల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు, చార్మినార్ పిఎస్లో పనిచేస్తున్న ఒకరు పాజిటివ్ వచ్చింది. కామాటిపుర, బహదూర్పురా, చత్రినాక తదితర స్టేషన్లలో పనిచేస్తున్న వారి ఇప్పటివరకు కరోనా బారినపడ్డారు.
20 Hyderabad Police tests positive for Corona