Thursday, May 9, 2024

నగరంలో 22 ఎంఎంటిఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల నేపథ్యంలో నగరంలో 22 ఎంఎంటిఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు చేస్తూ శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 నుంచి జులై 2 వరకు (దాదాపు ఏడు రోజులు) ఈ సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

లింగంపల్లి- టు హైదరాబాద్, ఉందానగర్ టు -లింగంపల్లి, ఫలక్‌నుమా టు లింగంపల్లి స్టేషన్ల మధ్య ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు చేశామని, రైళ్ల రద్దు వల్ల నగర ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎంఎంటిఎస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణాను ఎంచుకోవాలని వారు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News