హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 2,214 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, ఎనిమిది మంది మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ పేర్కొంది. అదే సమయంలో 2,474 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 1,93,600కి చేరాయి. ఇప్పటివరకు 1,135 మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం 29,058 యాక్టివ్ కేసులుండగా… 1,63,407 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా హైదరాబాద్ లో 305 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం 23,072 మంది బాధితులు హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 01.10.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe
For complete Bulletin.. please click on below link 👇https://t.co/nJ24zLHdOe pic.twitter.com/p4mgpuR2aT
— Eatala Rajender (@Eatala_Rajender) October 1, 2020
2214 New Covid19 Cases Record in Telangana