- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మంగళవారం నాడు కస్టమ్స్ అధికారులు కువైట్ నుండి వస్తున్న ప్రయాణికుడి వద్ద 233.20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుండి హైదరాబాద్ వస్తున్న గుర్ర నరేందర్ అనే ప్రయాణికుని వద్ద 11.49లక్షల విలువ చేసే అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు. నిందితుడు ఇండియాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
- Advertisement -