అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. దీంతో రాష్ట్రంలో ప్రతి రోజూ రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 2593 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 40మంది కరోనా బాధితులు చనిపోయారని తెలిపింది. తాజా కేసుల్లో ఎపికి చెందిన 2584మందికి కరోనా పాజిటీవ్ రాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 9మందికి వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 38,044కు చేరుకుంది. ఇక, రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 493కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 18,159మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి 19,393 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.కాగా, 24 గంటల్లో మొత్తం 22,304మందికి కరోనా పరీక్షలు చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 12,40,267 కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది.
2593 New Corona Cases Reported in AP