Saturday, April 27, 2024

కరోనా… మృతదేహంతో వెళ్తున్న అంబులెన్స్ పై రాళ్ల దాడి…..

- Advertisement -
- Advertisement -

Pelt stones at ambulance carrying COVID-19 victim’s body

బెంగళూరు: కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహంతో వెళ్తున్న అంబులెన్స్‌పై రాళ్లతో దాడి చేసిన యువకులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన కర్నాటకలో బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. బంగర్‌పేటకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌తో చనిపోయాడు. తమ వీధుల నుంచి కరోనాతో చనిపోయిన మృతదేహం వెళ్తే వైరస్  సోకుతుందనే భయంతో అంబులెన్స్ వెళ్లొందని గంగామనాపాల్య, కుమబారపాల్యా వాసులు వ్యతిరేకించారు. మృతదేహంతో అంబులెన్స్ అక్కడికి రాగానే స్థానికులు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని కాలనీ వాసులపై లాఠీ ఛార్జ్ చేశారు. వేరే మార్గం గుండా అంబులెన్స్‌ను శ్మశానా వాటికకు తరలించారు. ఈ ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News