Monday, May 6, 2024

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

3 killed after 7 Vehicles crashed into each other in Dhule

ముంబై: మ‌హారాష్ట్ర‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ధూలేలో బుధ‌వారం రాత్రి వేగంగా వ‌చ్చిన ఏడు, ఎనిమిది వాహ‌నాలు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ కారు నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో ముగ్గురు వ్య‌క్తులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయలయ్యాయి. స‌మాచారం అందుకుని వెంటనే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కారులో ఇరుకున్న మృతదేహాలను బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

3 killed after 7 Vehicles crashed into each other in Dhule

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News