- Advertisement -
చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం చోటుచేసుకుంది. జనసేన అధినేత, సినీ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్లు కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలంగా తెలుస్తోంది. కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై పవన్ బ్యానర్లు కడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనపై పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనసైనికుల మరణం మాటలకు అందని విషాదం అని పవన్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు పేర్కొన్నారు.
3 Pawan Fans died due to electric shock in Chittur
- Advertisement -