- Advertisement -
లక్నో: వలస కూలీలతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాపడడంతో 30 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని కన్నౌజ్లో శుక్రవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ కూలీలు పని నిమిత్తం ఢిల్లీకి వెళ్తుండగా తాల్ గ్రామ్ సమీపంలో 149 మైలురాయి వద్ద బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 30 మంది కూలీలు గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఇంజన్ వేడెక్కడంతోనే మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
- Advertisement -