Saturday, April 27, 2024

ఎపిలో కొత్తగా 3,040 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 1,00,103 శాంపిల్స్‌ పరీక్షించగా.. కొత్తగా 3,040 మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 14మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,17,253కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 12,960కు చేరింది. గత 24 గంటల్లో 4,576మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,300 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది.

3040 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News