Monday, April 29, 2024

రాష్ట్రంలో కొత్తగా 306 కోవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

306 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 69,422 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 306 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,59,313కి చేరింది. మరో ముగ్గురు వైరస్ బారినపడి మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,883గా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల 49 లక్షల 17 లక్షల 603 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మహమ్మారి నుంచి కొత్తగా 366 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 6,49,757 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,673 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.55 శాతంగా నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News