- Advertisement -
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.ఎపిలో గత 24 గంటల్లో 31 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 603కు చేరింది. ఇప్పటివరకు 15 మంది కరోనా బారిన పడి మృతి చెెందారు.ప్రస్తుతం 546 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడగా, కరోనా నుంచి కోలుకొని 42 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక, దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 14,676 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 496 మంది మరణించారు.
రాష్ట్రంలో జిల్లాలవారిగా కరోనా కేసుల వివరాలు:
జిల్లాలు |
కరోనా రోగుల సంఖ్య |
కర్నూల్ | 130 |
గుంటూరు | 126 |
కృష్ణ | 70 |
నెల్లూరు | 68 |
ప్రకాశం | 44 |
కడప | 37 |
వెస్ట్ గోదావరి | 35 |
చిత్తూరు | 28 |
అనంతపురం | 26 |
విశాకపట్నం | 20 |
ఈస్ట్ గోదావరి | 19 |
31 New Corona Cases Registered in Andhra Pradesh
- Advertisement -