Saturday, April 27, 2024

ఎపిలో తగ్గుతున్న కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

3166 new Covid-19 Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 3,166 మందికి కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 21 మందిని కరోనా కబలించింది. అదే సమయంలో 4,019 మంది కోలుకున్నారు.  దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,11,231కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 12,919 మంది కరోనాతో మృతిచెందారు. ఆంధ్రలో ఇప్పటివరకు 18,65,956 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఎపిలో 32,356 కరోనా యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

3166 new Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News