Monday, April 29, 2024

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

31923 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,923 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 282 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3,35,31,498కి పెరిగింది. ఇక, దేశంలో ఇప్పటివరకు 4,45,768 మంది బాధితులు కరోనాతో మరణించారు. గత 24గంటల్లో 31,990మంది కోలుకోగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా నుంచి 3,27,83,741మంది బాధితుల కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3.01లక్షల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 83.39 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ పేర్కొంది.

31923 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News