Saturday, May 18, 2024

రాష్ట్రంలో 348 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

348 new covid cases reported in telangana

హైదరాబాద్:  రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,580 శాంపిల్స్ పరీక్షించగా, 348 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈక్రమంలో జిహెచ్‌ఎంసి పరిధిలో అత్యధికంగా 93 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 429 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కరోనా మరణాలు చోటు చేసుకోలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,87,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,79,279 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,396 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 4,110 చేరుకుంది.

ఎపిలో 253 కేసులు 

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలోని గడచిన 24 గంటల్లో 253 కరోనా కేసులు నమోదుకాగా కరోనాతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఈక్రమంలో ఎపిలో ఇప్పటి వరకు 23,16,964కి కరోనా కేసులు చేరాయి. అదేవిధంగా కరోనాతో 14,718 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఎపిలో 5,181 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా నుంచి 22,97,065 మంది రికవరీ చెందారని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News