- Advertisement -
ముంబయిః మహరాష్ట్రలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) వేగంగా విజృంభిస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 394 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. 18మంది మృతి చెందారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,817కు చేరింది. ఇక కరోనాతో మరణించిన వారి సంఖ్య 301కి చేరింది. ఇక, దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా విలయతాండవం చేస్తోంది. ముంబయిలో ఏకంగా 4,447 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 80 శాతం కేసులు ముంబయిలోనే ఉన్నాయి.
394 New Corona Cases Registered in Maharashtra
- Advertisement -