- Advertisement -
హైదరాబాద్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారంకాలనీకి చెందిన బాలిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 22న బాలికపై జమాన్, అక్బర్, గయాజ్, అలీముద్దీన్లు నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితులరాలి తల్లితండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి నాలుగు సెల్ఫక్షన్లు, రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Hyd Police Arrested 4 Accused in Miner gang rape Case
- Advertisement -