- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 74,945 నమూనాలు పరీక్షించగా 3,986పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,83,132కు చేరింది. కొత్తగా 23మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,429కి చేరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 4,591 మంది కోవిడ్ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి 7,40,229మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 41,669 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 70,66,203 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
3986 New Corona Cases Registered in AP
- Advertisement -