Wednesday, May 8, 2024

అత్యల్పంగా 3,993 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

3993 new covid cases reported in india

న్యూఢిల్లీ: దేశంలో గడచిన 662 రోజుల్లో అత్యల్పంగా 3,993 కరోనా కేసులు ఒక్క రోజులో నమోదయ్యాయి. వీటిని కలుకుకుని దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,29,71,308 కరోనా కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 49,948కి తగ్గిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. తాజాగా..గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 108 మరణాలు చోటుచేసుకోవడంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా సోకడంతో మరణించిన వారి సంఖ్య 5,15,210కి పెరిగింది. గడచిన 24 గంటల్లో 4,170 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రోజు వారీ పాజిటివ్ రేటు 0.46 శాతం ఉండగా వీక్లీ పాజిటివ్ రేటు 0.68 శాతమని ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News