Saturday, May 4, 2024

భారత్ @ 4.03 లక్షల కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

4.03 Lakh corona cases in India

ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. కరోనా ధాటికి భారత్ విలవిలలాడుతోంది. ప్రతీ రోజు దాదాపుగా నాలుగు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. పెద్ద పెద్ద ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారాయి. గత 24 గంటల్లో 4.03 కరోనా కేసులు నమోదుకాగా 4092 మంది మృత్యువాతపడ్డారు. భారత్ లో ఇప్పటివరకు 2.22 కోట్లకు కరోనా కేసులు చేరుకోగా 2.42 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 1.83 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 37.36 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు భారత్ లో 16.94 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్రం ఆరోగ్య శాఖ ప్రకటించింది. 30.22 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News